మెజిస్ట్రేట్ మెండు రాజమల్లుకు ఘన సన్మానం

మెజిస్ట్రేట్ మెండు రాజమల్లుకు ఘన సన్మానం

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధి బూడిదగడ్డలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ పూజలు శనివారం ఘనంగా నిర్వహించారు. గీతాంజలి స్కూల్‌లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు దంపతులతో పాటు, పిసికింద శ్రీనివాస్ దంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం నాయకులు మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు దంపతులను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం భద్రాద్రికొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి...మాజీ కౌన్సిలర్ కనుకొట్ల కుమార్, పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుడిక్యాల సమ్మయ్య, నాయకులు మామిడి కనకరాజయ్య, తుమ్మ నరసయ్య, జాగిరపు మల్లేష్, రాపెల్లి రాజమౌళి, ఇంజపూరి రాజేశ్వరరావు, దూడం సుధాకర్,  ప్రభాకర్, తుమ్మ శ్రీనివాస్, ఇంజపూరి శివ, ఎస్. సుజాత, కొత్తగూడెం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఇమంది ఉదయ్,  అశోక్, కొండయ్య, గుడ్ల శ్రీనివాస్, రంజిత్,కనుకుంట్ల రాజమౌళి,సీనియర్ న్యాయవాది ఏ.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.