నూతన గ్రంథాలయాల భవనాల నిర్మాణానికి సహకరించండి - పసుపులేటి వీరబాబు
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: చండ్రుగొండ, దమ్మపేట మండల కేంద్రాల్లో నూతన గ్రంథాలయాల భవనాల నిర్మాణానికి సహకరించాలంటూ జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు ఆధ్వర్యంలో శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పసుపులేటి వీరబాబు మాట్లాడుతూ నేటి రోజుల్లో గ్రంథాలయాలకు మరింత ఆదరణ పెరుగుతోందని, ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత పెద్ద సంఖ్యలో గ్రంథాలయాలపై ఆధారపడుతున్నారని తెలిపారు. వారికి సరైన వసతులు కల్పిస్తే, వారు మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.
వినతిపత్రంపై స్పందించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ, సమన్వయంతో ముందుకు సాగుతూ నూతన గ్రంథాలయ భవనాల నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ వాసం రాణి, మండల నాయకులు వాసం శ్రీను, చిన్ని, చెట్టి, యువజన నాయకులు, భవన నిర్మాణ దాత కక్కిరాల రమేష్, చిట్టిబాబు, పగడాల రాంబాబు, అత్తులూరి రాంబాబు (మాజీ సర్పంచ్), శివతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Post a Comment