అత్యధిక కేసుల పరిష్కారం కోసం కృషి చేయండి - న్యాయాధికారి రాజేందర్
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: సెప్టెంబర్ 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ విజయవంతంగా నిర్వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మీటింగ్ హాలులో కోర్టు కానిస్టేబుల్స్తో జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ కోరారు. గురువారం పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసులు, ఇ-పిటి కేసుల వివరాలను న్యాయాధికారి రాజేందర్ స్టేషన్ల వారీగా అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో అత్యధిక కేసులను పరిష్కరించడం ద్వారా జిల్లాను ఉన్నత స్థానంలోకి తీసుకురావడానికి పోలీస్ అధికారులు కృషి చేయాలని ఆయన సూచించారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు, లైజన్ ఆఫీసర్ ఘానీ, కోర్టు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.


Post a Comment