జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి - న్యాయాధికారి ఎం.రాజేందర్
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: కొత్తగూడెం జిల్లా కోర్టులో సెప్టెంబర్ 13న జరిగే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయాధికారి ఎం.రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికైనా ఏమైనా కేసులు ఉన్నట్లైతే వాటిని ఈ లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవచ్చని అన్నారు.
రాజీ పడదగ్గ కేసులు ఇవే..
1.యాక్సిడెంట్ కేసులు
2.సివిల్ కేసులు
3.చీటింగ్ కేసులు
4.చిట్ పన్డ్ కేసులు
5.భూతగాదాలు కు సంబంధించిన కేసులు
6.వివాహ బంధానికి సంబంధించిన కేసులు
7.చిన్నచిన్న దొంగతనం కేసులు
8.ట్రాఫిక్ చాలాన్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
9. కుటుంబ తగాదాలు
10. బ్యాంకు లావాదేవీల కేసులు
11. టెలిఫోన్ బకాయిల కేసులు
12. కొట్టుకున్న కేసులు
13. సైబర్ క్రైమ్ కేసులు
14. చెక్ బౌన్స్ కేసులు
ఈ లోక్ అదాలత్ లో రాజీ చేసుకుని, కేసును పూర్తిగా క్లోజ్ చేసుకునే అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.

Post a Comment