జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన న్యాయధికారి వినయ్ కుమార్
- కొత్తగూడెం మూడవ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్గా వనం వినయ్కుమార్
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్లోని ఓల్డ్ మలక్పేట్కు చెందిన వనం వినయ్కుమార్ కొత్తగూడెం మూడవ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్గా నియమితులయ్యారు. ఈ క్రమంలో ఆయన రెండవ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ బి.రవికుమార్ నుంచి బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా శుక్రవారం వినయ్కుమార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
Advertising:


Post a Comment