కొత్తగూడెం కోర్టులో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: కొత్తగూడెం జిల్లా కోర్టు ప్రాంగణంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు ఎస్. సరిత, కె. కిరణ్ కుమార్, కె. కవిత, కె. సాయి శ్రీ, స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు జనపరెడ్డి గోపికృష్ణ, ప్రధాన కార్యదర్శి బాగం మాధవరావు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ ఉప్పు అరుణ్, చిన్నికృష్ణ, కాసాని రమేష్, మాలోత్ ప్రసాద్, మహిళా ప్రతినిధి ఆడపాల పార్వతి, సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.వి.డి. లక్ష్మి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెలగల నాగిరెడ్డి, ఏపీపీలు నాగలక్ష్మి, ఎన్. లావణ్య, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కె. కిరణ్, న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామిశెట్టి రమేష్, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జెండా ఆవిష్కరణ అనంతరం చెస్, క్రికెట్, షటిల్, కుర్చీలాట, త్రాడు లాగుడు వంటి క్రీడల్లో విజేతలకు న్యాయమూర్తుల చేత బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఫోటో సెషన్ నిర్వహించారు.

Post a Comment