జిల్లా అధికారులతో ప్రధాన న్యాయమూర్తి సమీక్షా సమావేశం

జిల్లా అధికారులతో ప్రధాన న్యాయమూర్తి సమీక్షా సమావేశం

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  కొత్తగూడెం జిల్లా కోర్టు ప్రాంగణంలోని సమావేశ మందిరంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మాట్లాడుతూ జైలులో ఉన్న ముద్దాయిల కేసులను దశలవారీగా, రోజువారిగా సాక్ష్యాలు ప్రవేశపెట్టి అంతిమ తీర్పులకు సహకరించాలని, వారెంట్లు ఉన్న పెండింగ్ కేసులు వెంట వెంటనే అమలు పరచాలని తెలిపారు. పాత పెండింగ్ కేసులలో సాక్ష్యాలను తీసుకొని రావాలని, నూతనంగా నమోదైన కేసుల్లో వెంటనే ఛార్జ్‌షీట్లు దాఖలు చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి ఎస్. సరిత, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కే. కిరణ్ కుమార్, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఎం. రాజేందర్, అదనపు సీనియర్ సివిల్ జడ్జి కర్నాటి కవిత, రెండవ అదనపు జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ బి. రవి కుమార్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బిరుదు రాజు రోహిత్ రాజు, భద్రాచలం ఏ.ఎస్.పి విక్రమ్ కుమార్ సింగ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఏపీపీలు, జిల్లాలోని డీఎస్పీలు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు, ఫారెస్ట్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు, ఆర్ అండ్ బి అధికారులు, కోర్టు నోడల్ ఆఫీసర్, కోర్టు లైజాన్ ఆఫీసర్లు, పోలీస్ కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.


Blogger ఆధారితం.