యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి - 3 టౌన్ సీఐ శివప్రసాద్
జె.హెచ్.9.మీడియా,భద్రాద్రికొత్తగూడెం: యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కొత్తగూడెం 3 టౌన్ సీఐ కె.శివప్రసాద్ అన్నారు. కొత్తగూడెం పట్టణంలోని పవర్ హౌస్ జిమ్ నిర్వాహకులు...కోచ్ షమీఉద్దీన్ జిమ్ ప్రారంభించి 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సీఐ శివప్రసాద్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా, సక్రమమైన మార్గంలో నడిచి తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. ప్రతీ రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా దృఢంగా, ఆరోగ్యంగా మారతారని చెప్పారు.
మనం ఏదైతే లక్ష్యం నిర్ధేశించుకుంటామో, దాని ఫలితానికై మనమే కష్టపడాలని, ప్రతీ కష్టానికి ఫలితం తప్పకుండా ఉంటుందని చెప్పారు. ప్రతీ ఒక్కరూ ఒక లక్ష్యం పెట్టుకుని, ఆ లక్ష్యం సాధన కోసం 365 రోజులు నిరంతరం కృషి చేయాలని, సాధన చేస్తే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.
గతంతో పోలిస్తే నేడు క్రీడాకారులకు అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని వినియోగించి మరింత శ్రమతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతూ జిల్లాకు పేరు తెచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కోచ్ షమీఉద్దీన్ ఎన్నో ఏళ్లుగా శిక్షణ ఇచ్చి వందలాది మంది యువతీ–యువకులను రాష్ట్ర, జాతీయ స్థాయి బాడీబిల్డింగ్, పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో ఎనలేని పాత్ర పోషించారని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్, వై. శివసుబ్రమణ్యం, న్యాయవాది గోపికృష్ణ, మాలోత్ రాజా, ధారా నాగేశ్, ఎలక్ట్రికల్ ఏడి రవి, ధర్మేందర్, లారెన్స్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment