ఎడతెరిపిలేని వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి – ఎస్పీ రోహిత్ రాజు

ఎడతెరిపిలేని వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి – ఎస్పీ రోహిత్ రాజు

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలోని నదులు, వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతూ ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నందున, కాలి నడకన లేదా వాహనాలతో ప్రయాణించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సూచించారు.

ఉధృత ప్రవాహ ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకోవడం వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. వర్షాల కారణంగా ప్రమాదకరంగా మారుతున్న రహదారులు, చెరువులు, వాగులు, నదుల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పోలీసు శాఖ ఇతర శాఖలతో కలిసి పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

వరదల్లో చిక్కుకుని ఆపదలో ఉన్న వారిని రక్షించేందుకు జిల్లా పోలీసు శాఖ తరఫున 24×7 అందుబాటులో ఉండేలా డిడిఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. ఎవరైనా విపత్కర పరిస్థితుల్లో ఉన్నట్లయితే వెంటనే డయల్ 100 కి ఫోన్ చేసి పోలీసు సేవలను పొందాలని సూచించారు.

ప్రమాదాలు తలెత్తకుండా పోలీసులు చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరుతూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Blogger ఆధారితం.