జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి - జిల్లా జడ్జి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: కొత్తగూడెం జిల్లా కోర్టులో జూన్ 14వ తారీఖున నిర్వహించబడే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్.. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్, కార్యదర్శి ఎం. రాజేందర్ సోమవారం ఒక ప్రకటనలో సూచించారు.
ఎవరికైనా ఏవైనా కేసులు ఉన్నట్లయితే వాటిని ఈ లోక్ అదాలత్ ద్వారా రాజీ (కాంప్రమైజ్) చేసుకుని పూర్తిగా ముగించుకునే అవకాశం ఉందని తెలిపారు.
లోక్ అదాలత్లో రాజీ పడదగిన కేసులు ఇవే:
రోడ్డు ప్రమాద కేసులు , సివిల్ కేసులు, మోసపూరిత కేసులు, చిట్ ఫండ్ కేసులు, భూ తగాదాల కేసులు, వివాహ బంధానికి సంబంధించిన కేసులు, చిన్నచిన్న దొంగతనాల కేసులు, ట్రాఫిక్ చలాన్లు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, కుటుంబ తగాదాల కేసులు, బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన కేసులు,టెలిఫోన్ బకాయిల కేసులు,గొడవల కేసులు,సైబర్ క్రైమ్ కేసులు, చెక్ బౌన్స్. ఈ కేసులను రాజీ చేసుకుని కోర్టు నుంచి పూర్తిగా విడిపోడానికి ఇది మంచి అవకాశం కావడంతో కక్షిదారులు తప్పక ఉపయోగించుకోవాలని వారు కోరారు.

Post a Comment