ధరణి పోర్టల్ నుండి రైతులను ఆదుకునేందుకే భూభారతి - కొత్వాల
ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని రూపొందించింది అన్నారు. రైతుల భూ సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రైతులు తమ భూ సమస్యలను రైతు సదస్సుల్లో అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని కొత్వాల అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్వంచ తహసిల్దార్ ధారా ప్రసాద్, పట్టణ రెవెన్యూ అధికారి ఎస్. రవికుమార్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ ఎర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, కాంగ్రెస్ నాయకులు కలగట్ల నాగిరెడ్డి, అడ్వొకేట్ పిట్టల రాము, లింగం శ్రీను, మార్గం అంకయ్య, గంగిరెడ్డి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment