ఐ.ఎల్.పీ.ఏ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి - ఐ.ఎల్.పీ.ఏ జిల్లా కన్వీనర్ గోపికృష్ణ

ఐ.ఎల్.పీ.ఏ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి -  ఐ.ఎల్.పీ.ఏ జిల్లా కన్వీనర్ గోపికృష్ణ

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం : ఈనెల 20న కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించనున్న ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐ.ఎల్.పీ.ఏ) రాష్ట్ర ఐదవ సదస్సును న్యాయవాదులంతా కలిసికట్టుగా జయప్రదం చేయాలని ఐ.ఎల్.పీ.ఏ జిల్లా కన్వీనర్ జే. గోపికృష్ణ పిలుపునిచ్చారు.

శనివారం జిల్లా కోర్టు లైబ్రరీ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ “బ్లాక్ కోట్స్ ఫర్ బ్లూ రెవల్యూషన్” నినాదంతో న్యాయవాదుల హక్కులు, సమస్యల పరిష్కారం, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఐ.ఎల్.పీ.ఏ నిరంతర పోరాటం చేస్తోందన్నారు.

న్యాయవాదులు ఎదుర్కొంటున్న వృత్తిపరమైన, సామాజిక, ఆర్థిక సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే కాకుండా, అట్టడుగు వర్గాల న్యాయవాదులను విద్య ద్వారా విముక్తి చేయాలనే లక్ష్యంతో ఐ.ఎల్.పీ.ఏ ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ క్రమంలో జూనియర్ సివిల్ జడ్జ్ (JCJ), అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) తదితర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న న్యాయవాదులకు 365 రోజుల ఆన్లైన్ ఉచిత కోచింగ్‌ను నిరంతరంగా అందిస్తున్న ఏకైక న్యాయవాద సంఘంగా ఐ.ఎల్.పీ.ఏ నిలుస్తోందన్నారు.

సమానత్వం, న్యాయం, సామాజిక చైతన్యాన్ని లక్ష్యంగా పెట్టుకొని నిర్వహించనున్న ఈ రాష్ట్ర మహాసభను అందరూ కలిసి విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో ఐ.ఎల్.పీ.ఏ సభ్యులు భానుప్రియ, యెర్రా కామేష్, సాధిక్ పాషా, అంబటి రమేష్, మారపాక రమేష్, వడ్లకుండ హరి తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.