డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 128 మందికి జరిమానాలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 128 మందికి జరిమానాలు

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 128 మందికి జరిమానాలు విధిస్తూ కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు బుధవారం తీర్పు చెప్పారు.

వివరాల్లోకి వెళితే  కొత్తగూడెం వన్‌టౌన్ ఎస్‌ఐ తుంగ రాకేష్, జి. విజయల కథనం ప్రకారం వాహనాలు నడుపుతున్న నలుగురిని ఆపి బ్రీత్ ఎనలైజర్‌ ద్వారా పరీక్షించగా వారు మద్యం తాగినట్లు రుజువై, కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం ఒప్పుకున్న వారికి మెజిస్ట్రేట్ జరిమానా విధించగా వారు చెల్లించారు.

కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్‌ఐ కె. నరేష్ పర్యవేక్షణలో వాహన తనిఖీలు నిర్వహించగా పది మంది మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. పరీక్షలో మద్యం తాగినట్లు నిరూపితమవడంతో కోర్టులో ప్రవేశపెట్టగా, నేరం ఒప్పుకుని జరిమానా చెల్లించారు.

అప్పటి టూ టౌన్ ఎస్‌హెచ్‌ఓ టి.రమేష్ కుమార్, అప్పటి ఎస్సై ఎం.సెల్వరాజ్ వాహన తనిఖీలు నిర్వహించగా ముగ్గురు మద్యం తాగి వాహనం నడుపుతుండగా బ్రీత్ ఎనలైజర్‌ ద్వారా రుజువై, కోర్టులో నేరం అంగీకరించి జరిమానా చెల్లించారు.

త్రీ టౌన్ ఎస్‌ఐ పురుషోత్తం తన బృందంతో వాహన తనిఖీలు చేయగా పన్నెండు మందిని బ్రీత్ ఎనలైజర్‌ పరీక్షించగా మద్యం తాగినట్లు రుజువై, నేరం ఒప్పుకుని జరిమానా చెల్లించారు.

సుజాతనగర్ పరిధిలో ఎస్‌హెచ్‌ఓ ఎం. రమాదేవి తన బృందంతో తనిఖీలు నిర్వహించగా 26 మందికి మద్యం తాగినట్లు రుజువై కోర్టులో నేరం ఒప్పుకుని జరిమానాలు చెల్లించారు.

పాల్వంచ రూరల్ ఎస్‌ఐ బి. సురేష్ తన సిబ్బందితో, చంద్రుగొండ ఎస్‌హెచ్‌ఓ పి. శివరామకృష్ణ తన బృందంతో వాహన తనిఖీలు నిర్వహించగా 15 మంది మద్యం తాగి వాహనం నడుపుతున్నట్లు రుజువై కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం అంగీకరించడంతో జరిమానాలు విధించారు.

చుంచుపల్లి ఎస్‌హెచ్‌ఓ జి. రవికుమార్ బృందం తనిఖీల్లో 20 మంది మద్యం సేవించినట్లు రుజువై కోర్టులో నేరం ఒప్పుకుని వారు జరీమానాలు చెల్లించారు.

ములకలపల్లి ఎస్‌హెచ్‌ఓ కిన్నర రాజశేఖర్ తన బృందంతో తనిఖీలు నిర్వహించి 30 మందిని బ్రీత్ ఎనలైజర్‌ ద్వారా పరీక్షించగా మద్యం తాగినట్లు రుజువై కోర్టులో ప్రవేశపెట్టగా నేరం అంగీకరించి జరిమానాలు చెల్లించారు.

Blogger ఆధారితం.