పెద్దమ్మతల్లికి వైభవంగా సువర్ణ పుష్పార్చన
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పాల్వంచ మండలం కేశవాపురం-జగన్నాధపురం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కనకదుర్గ దేవస్థానంలో (పెద్దమ్మ గుడి) గురువారం పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎన్. రజనీకుమారి ఆదేశాల మేరకు అమ్మవారికి 108 సువర్ణ పుష్పములతో ప్రత్యేక పుష్పార్చన వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదనతో పాటు విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment