డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మందు బాబులకు జరిమానాలు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో నేరాలు అంగీకరించిన పలువురు వ్యక్తులకు జరిమానాలు విధిస్తూ, కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు సోమవారం తీర్పులు ఇచ్చారు.
కేసుల వివరాల ప్రకారం, పాల్వంచ టౌన్ ఎస్ఐ డి.రాఘవయ్య వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సందర్భంలో ఓ వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతుండగా బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించగా అతడు మద్యం సేవించినట్లు రుజువైంది. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత నేరాన్ని అంగీకరించడంతో జరిమానా విధించి, మూడు గంటల పాటు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ సూపరింటెండెంట్ ఆదేశించిన సేవలు చేయాల్సిందిగా ఆదేశించారు.
కొత్తగూడెం త్రీటౌన్ ఎస్ఐ పురుషోత్తం తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో మద్యం తాగి వాహనం నడుపుతున్న మరో వ్యక్తిని పట్టుకుని కోర్టులో ప్రవేశపెట్టగా, నేరం అంగీకరించడంతో జరిమానా విధించారు.
అలాగే, ట్రాఫిక్ ఎస్ఐ కె.నరేష్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 8 మందిని గుర్తించి కోర్టులో ప్రవేశపెట్టగా, నేరాన్ని అంగీకరించడంతో వారికి జరిమానాలు విధించి వసూలు చేశారు.
కొత్తగూడెం వన్ టౌన్ ఎస్ఐ జి.విజయ వాహనాల తనిఖీలు చేస్తున్న సమయంలో, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టగా, నేరాన్ని అంగీకరించడంతో జరిమానా విధించారు.

Post a Comment