పాల్వంచలోని మీ సేవ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఈడీఎం సైదేశ్వర రావు

పాల్వంచ లోని మీ సేవ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఈడీఎం సైదేశ్వర రావు

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  ఈఎస్డీ కమిషనర్, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశాల మేరకు కొత్తగా ప్రవేశపెట్టిన రేషన్ కార్డ్ సేవలు, మీ సేవ కేంద్రాల పనితీరును పరిశీలించే ప్రక్రియలో భాగంగా శనివారం డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వర రావు, టీజీటీఎస్ డీఎం రఘు పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని మీసేవ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పాల్వంచ లోని మీ సేవ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఈడీఎం సైదేశ్వర రావు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీసేవ ఆపరేటర్లందరూ వివిధ అవసరాల కోసం మీసేవ కేంద్రాలకు వచ్చే ప్రజల వద్ద నుండి అదనపు రుసుములు వసూలు చేయకూడదని, మీసేవ కేంద్రాలకు వచ్చే ప్రజల పట్ల మర్యాదతో వ్యవహరించాల్సిందిగా సూచించారు. ఎవరైనా నిర్ణీత రుసుము కంటే అధికంగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజలకు మీసేవ కేంద్రాలలో ఏదైనా సమస్యలు ఎదుర్కొన్నట్లయితే టోల్ ఫ్రీ నంబర్ 1100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని కోరారు. ఈ సందర్భంగా మీ సేవ కేంద్రాల్లో ప్రజలతో మాట్లాడి, కొత్త రేషన్ కార్డులు మరియు రేషన్ కార్డుల్లో సవరణలు నిరంతర ప్రక్రియ అని, అందరూ సహకరించాలని వారు తెలిపారు.

Blogger ఆధారితం.