మహిళా సమాఖ్య సభ్యులచే వెదురు సాగు

మహిళా సమాఖ్య సభ్యులచే వెదురు సాగు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :తెలంగాణ రాష్ట్రంలోని 5 జిల్లాలలో (భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, అదిలాబాద్, ఆసిఫాబాద్) జిల్లాకు 5 మంది చొప్పున 5000 మంది మహిళా సమాఖ్య సభ్యులచే వెదురు సాగు ప్రయోగాత్మకంగా చేపట్టేందుకు గ్రామీణ అభివృద్ధి సంస్థ నిర్ణయించిందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన తెలిపారు.

మంగళవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో రెండో రోజు ఇండస్ట్రీ క్రాఫ్ట్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వెదురు సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని చుండ్రుగొండ, ములకలపల్లి, గుండాల మండలాల్లో పైలట్ ప్రాజెక్టు క్రింద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఈ మండలాల్లోని 1000 మంది మహిళా సమాఖ్య సభ్యులను గుర్తించి వారికి వెదురు సాగుపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

వీరికి ఉపాధి హామీ పథకం ద్వారా మొక్కలు సరఫరా చేయడం, నిర్వహణ కోసం నిధులు సమకూర్చడం జరుగుతుందని ఆమె తెలిపారు. వెదురు మొక్కలు నాటిన తర్వాత నాలుగు సంవత్సరాలకు దిగుబడి ప్రారంభమవుతుందని, అప్పటి నుంచి 80 సంవత్సరాల వరకు ప్రతి ఏడాది వెదురు దిగుబడిని విక్రయించడం ద్వారా రైతులు ఆదాయం పొందవచ్చని వివరించారు. ఇందుకు సంబంధించి సర్టిఫికేట్ మరియు మార్కెటింగ్ పరంగా సెర్ప్ మరియు ఇండస్ట్రీ సంస్థ సాంకేతిక సహకారం అందిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు డీఆర్‌డీఓ నీలేష్, మూడు మండలాల డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలు, ఏపీవోలు, ఎఫ్‌పీఓలు, బీఓడీలు, ఉద్యానవన శాఖ అధికారులు, అటవీ శాఖ అధికారులు, ఇండస్ట్రీ క్రాఫ్ట్ ఫౌండేషన్ అధికారులు రమ్య, శ్రీకాంత్, సెర్ప్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాస్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Blogger ఆధారితం.