శివాలయం విగ్రహ ప్రతిష్ఠ పూజల్లో కొత్వాల

శివాలయం విగ్రహ ప్రతిష్ఠ పూజల్లో కొత్వాల
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పాల్వంచ మండలం పరిధిలోని కేశవాపురం - జగన్నాధపురం గ్రామంలోని శ్రీ కనకదుర్గ దేవాలయం (పెద్దమ్మతల్లి గుడి) ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శివాలయంలో విగ్రహ ప్రతిష్ఠతో పాటు మహాకుంభాభిషేకం, కల్యాణ మండపం, అన్నదాన సత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గత ఐదు రోజులుగా జరుగుతున్న పూజలు సోమవారంతో ముగిశాయి. సోమవారం మాఘ శుద్ధ త్రయోదశి సందర్భంగా స్థిర మంత్రం, విగ్రహ శిఖర ప్రతిష్ఠ, కుంభాభిషేకం, ధ్వజస్థంభ ప్రతిష్ఠ, మహాన్నదాన కార్యక్రమంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, సతీమణి విమలాదేవి దంపతులు పాల్గొని పూజలు చేశారు.

పెద్దమ్మతల్లి గుడిలో శివలింగ ప్రతిష్ఠకు విచ్చేసిన తుని తపోవనం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ వారిని కొత్వాల కలిసి ఆశీర్వాదం పొందారు.

ఈ కార్యక్రమాల్లో పెద్దమ్మతల్లి గుడి మాజీ చైర్మన్ మహిపతి రామలింగం, మాజీ డైరెక్టర్లు SVRK ఆచార్యులు, చింతా నాగరాజు, గంధం వెంగళరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోండం వెంకన్న, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పైడిపల్లి మహేష్, నాయకులు సందు ప్రభాకర్, బాదార్ల జోషి, శ్రీకాంత్, బానోత్ బాలాజీ, గంధం నర్సింహారావు, కాపర్తి వెంకటాచారి, తిరుమల రమేష్, బాషా తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.