అనాధ శరణాలయాన్ని సజావుగా నడపండి - న్యాయమూర్తి జి. భానుమతి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : కొత్తగూడెం బూడిదగడ్డలోని శ్రీ స్నేహలత సంద్యలత పిల్లల ఆశ్రమాన్ని మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి జి. భానుమతి సందర్శించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పిల్లలకు అందిస్తున్న కనీస సౌకర్యాల గురించి ఆశ్రమ నిర్వహకుడు కొమరయ్యను అడిగి తెలుసుకున్నారు. వివిధ కారణాల వలన తల్లిదండ్రులను కోల్పోయి, పిల్లల సంరక్షణ కష్టంగా ఉండడం వల్ల ఆశ్రయానికి వచ్చిన పిల్లలకు సంరక్షణ, విద్య, ఆహారం తదితర అంశాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా తెలిపారు.
న్యాయమూర్తి అనాధ శరణాలయం ఆవరణ, కిచెన్ రూమ్, స్టోర్ రూమ్ను పరిశీలించారు. అనాధ శరణాలయాన్ని సజావుగా నిర్వహించాలని అన్నారు. అనంతరం రైటర్ బస్తీలోని శ్రీ సత్యసాయి అనాధ వృద్ధాశ్రమాన్ని సందర్శించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కౌన్సిల్ పి. నిరంజన్ రావు, న్యాయవాది మెండు రాజమల్లు పాల్గొన్నారు.

Post a Comment