ఈవీఎం గోడౌన్ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : ఆర్డీవో కార్యాలయం ప్రాంగణంలో ఈవీఎం గోడౌన్ను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎం భద్రతకు సంబంధించి ప్రతినెల తనిఖీ చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా ఈవీఎం గోడౌన్ను సందర్శించామని తెలిపారు.
ఈ పరిశీలనలో భాగంగా ఈవీఎం, వీవీ ప్యాట్లు ఉన్న గదిని, సీసీ కెమెరా గదిలో కెమెరాల పనితీరును పరిశీలించారు. అనంతరం గోడౌన్ పరిసర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, అనుమతి లేనిదే ఎవరినీ లోపలికి అనుమతించరాదని అధికారులకు, సెక్యూరిటీ గార్డ్కు తెలిపారు. అనంతరం తనిఖీ రిజిస్టర్లపై సంతకం చేశారు.
ఈ తనిఖీలో కలెక్టర్ వెంట ఎన్నికల సూపరింటెండెంట్లు రంగా ప్రసాద్, ధారా ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment