NMDC అధికారులతో కొత్వాల శ్రీనివాసరావు, సాబీర్ పాషా సమావేశం

NMDC అధికారులతో కొత్వాల శ్రీనివాసరావు, సాబీర్ పాషా సమావేశం

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పాల్వంచలోని ఎన్.ఎం.డి.సి కర్మాగారంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస పనిదినాలు కల్పించాలని రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా అధికారులను కోరారు.


మంగళవారం NMDC అధికారులు ఎం.శ్రీధర్, డి.రాజు లతో కొత్వాల శ్రీనివాసరావు, ఎస్.కె. సాబీర్ పాషా సమావేశమయ్యారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా చాలీచాలని జీతాలతో NMDC లో పనిచేస్తున్న 51 మంది కాంట్రాక్టు కార్మికులకు సరిపడా వేతన దినాలు లేకపోవడాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. దీనిపై స్పందించిన అధికారులు కార్మికులకు నెలకు కనీసం 10 పని దినాలు కల్పించనున్నట్లు ప్రకటించారు.


ఈ కార్యక్రమంలో NMDC అధికారులు ఎం.శ్రీధర్, డి.రాజు, INTUC కార్యదర్శి బానోత్ బాలు నాయక్, అధ్యక్షులు సకినాల కోటేశ్వరరావు, AITUC కార్యదర్శి అల్లి కాంతయ్య, మానిక్ చంద్, కాంగ్రెస్ నాయకులు దారా చిరంజీవి, పులి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.