పెద్దమ్మతల్లికి ఘనంగా పంచామృతాభిషేకం
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పాల్వంచ మండలం, కేశవాపురం-జగన్నాధపురం గ్రామంలోని శ్రీ కనకదుర్గ దేవస్థానంలో శుక్రవారం పంచామృతాభిషేకం వైభవంగా నిర్వహించారు.
మొదటిగా, మేళతాళాలతో దేవస్థాన అర్చకులు, భక్తులు అమ్మవారికి పంచామృతాలు, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం అమ్మవారి మూలవిరాట్కు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచ హారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం తదితర పూజలు చేశారు.
ఈ సందర్భంగా భక్తులు పూజలలో పాల్గొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎన్. రజనీకుమారి, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Post a Comment