భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఎయిర్పోర్ట్ కు కృషి చేస్తా - మంత్రి పొంగులేటి
శుక్రవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా సుజాత్ నగర్ మండలంలోని వేపలగడ్డ గ్రామం నుండి బృందావనం వరకు మూడు కిలోమీటర్ల పొడవునా 2 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పాల్గొన్నారు.
అనంతరం కొత్తగూడెం లోని శ్రీ రామచంద్ర కళాశాలలో జరిగిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్లో మంత్రి పొంగులేటి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ప్రతి సంవత్సరం జనవరి మూడో తారీఖున సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది’’ అన్నారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ చొరవతో ‘‘ఈ ఏరు పండగ’’ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పండగ జనవరి 9న ప్రారంభం కానుంది. గోదావరి నది పరివాహక ప్రాంతం, భద్రాచల ఆలయం, కనకగిరి శిఖరం, కిన్నెరసాని డ్యామ్, భద్రాచల ఆలయం వంటి పర్యాటక ప్రదేశాలను ప్రదర్శించేందుకు ఈ పండగను ప్రత్యేకంగా రూపొందించామని చెప్పారు.
పాల్వంచ మండలం రెడ్డిగూడెం గ్రామంలో 1 కోటి 70 లక్షల రూపాయలతో హై లెవెల్ బ్రిడ్జి శంకుస్థాపన చేయబడింది. అలాగే, పాండురంగాపురం బ్రిడ్జి వద్ద 10 కోట్ల రూపాయలతో నిర్మాణం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్ మరియు ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Post a Comment