ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు సర్వం సిద్ధం - జిల్లా కలెక్టర్

ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు సర్వం సిద్ధం - జిల్లా కలెక్టర్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : ముక్కోటి ఏకాదశి ఉత్సవాలలో భాగంగా ఈనెల 9, 10వ తేదీలలో జరగబోయే తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా ఉత్తర ద్వారం వద్ద సెక్టార్ అధికారులకు తెప్పోత్సవం, ద్వార దర్శనం రోజు తీసుకోవలసిన జాగ్రత్తలు, చర్యలపై దిశా నిర్దేశం చేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులందరూ 10వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు అన్ని సెక్టార్ల అధికారులు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ భద్రాచలం ఆర్డీవో కార్యాలయంలో ముక్కోటి ఉత్సవాల నిర్వహణపై ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈసారి ముక్కోటి ఏకాదశి మహోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని ఆయన తెలిపారు. ఉత్తర ద్వార దర్శనం వద్ద భక్తులను నియంత్రించేందుకు సెక్టార్లుగా విభజించడం జరిగిందని తెలిపారు. పదవతారీఖు ఉదయం ఐదు గంటలకు స్వామివారి ఉత్తర ద్వార ద్వారం ఉంటుంది అని అన్నారు. భద్రాచలం విచ్చేసే భక్తులు భద్రాచల రాముని దర్శించడంతోపాటు మంచి అనుభూతిని కలిగేలా ఏరు పండగను రూపొందించడం జరిగిందని తెలిపారు.


ఏరు అనగా కోయ, తెలుగు భాషల్లో నది అని అర్థం వస్తుంది. గోదావరి, తాళి పేరు మరియు కిన్నెరసాని పరివాహక ప్రాంతాల్లో సాంప్రదాయాలు కలిసిన ప్రత్యేకమైన సంస్కృతి మన జిల్లాలో ఉందని ఆయన అన్నారు. గిరిజన సాంస్కృతి, స్థానిక సాంప్రదాయాలు మరియు ఉత్పత్తులను అందరికీ తెలియపరచడమే ఏరు పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. దీనిలో భాగంగా గోదావరి ఘాట్ వద్ద 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఆశ్రమ పాఠశాల విద్యార్థులు, గిరిజన కళాకారులు, స్థానిక మరియు గిరిజన నృత్య ప్రదర్శనలు అందరూ వీక్షించేలా గోదావరి ఘాట్ వద్ద స్టేజి నిర్మించడం జరిగిందన్నారు. అదేవిధంగా కరకట్ట వద్ద 50 స్టాళ్లను ఏర్పాటు చేసి ఆర్గానిక్ నెయ్యి, అటవీ ఉత్పత్తులు, గిరిజన ఉత్పత్తులు విక్రయించడం జరుగుతుందని తెలిపారు. గోదావరి ఘాట్ వద్ద బోటింగ్ పాయింట్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని, సామాన్యులు కూడా గోదావరిలో బోటింగ్ అనుభవం పొందేలా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. గోదావరి నది ఒడ్డు పైన ఏర్పాటు చేసిన గుడారాలలో రాత్రి బస పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటుందని తెలిపారు. ఐటీడీఏ గిరిజన మ్యూజియం ఏర్పాటుకు ఐటీడీయో పిఓ ఎంతగానో కృషి చేశారని ఆయన చెప్పారు.


భద్రాచలంకి వచ్చిన భక్తులు మరియు పర్యాటకులు రాత్రి బస చేసి, మరుసటి రోజు మ్యూజియం, బోజ్జికుప్ప బెండలంపాడు ట్రాకింగ్ చేసేలా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి దీవులను చూడాలనుకున్న వారు మన కిన్నెరసాని లో పర్యటించాల్సిందిగా కోరారు. ఈ ఏర్పాట్లు అన్నింటిని మహిళా సమాఖ్య ద్వారా సభ్యులు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ ద్వారా మహిళా సమాఖ్య అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.


ప్రస్తుతం ఈ రివర్ ఫెస్టివల్‌లో పరిమిత సంఖ్యలో అనుమతిస్తున్నామని, మార్చ్ వరకు ఈ రివర్ ఫెస్టివల్ ను కొనసాగిస్తామని కలెక్టర్ తెలిపారు.


ఉత్తర ద్వార దర్శనానికి విచ్చేసే భక్తులు, ద్వార దర్శనం అనంతరం భారీ కెట్లు దాటవద్దని, ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


Blogger ఆధారితం.