పెద్దమ్మ తల్లికి ఘనంగా సువర్ణ పుష్పార్చన
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పాల్వంచ మండలం, కేశవాపురం - జగన్నాథపురం గ్రామంలో వెలసియున్న శ్రీ కనకదుర్గ దైవస్థానం (పెద్దమ్మ తల్లి గుడి)లో గురువారం అమ్మవారికి 108 పుష్పాలతో సువర్ణ పుష్పార్చన నిర్వహించారు.
ఇందులో భాగంగా అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు అర్చకులు నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి రజనీ కుమారి, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Post a Comment