పెద్దమ్మతల్లికి ఘనంగా పంచామృతాభిషేకము
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పాల్వంచ మండలం, కేశవాపురం - జగన్నాధపురం గ్రామంలో వెలసియున్న శ్రీ కనకదుర్గ దేవస్థానంలో (పెద్దమ్మగుడి) శుక్రవారం అమ్మవారికి పంచామృతములతో వైభవంగా అభిషేకం నిర్వహించారు.
ముందుగా మేళతాళాలతో దేవస్థాన అర్చకులు, భక్తులు జన్మస్థలం వద్ద ఉన్న అమ్మవారికి పంచామృతాలు, పసుపు, కుంకుమ, గాజులు, హారతులు సమర్పించి, అనంతరం దేవాలయంలోని అమ్మవారి మూలవిరాట్కు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పంచ హారతులు, నివేదన, నీరాజన మంత్రపుష్పం తదితర పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తులు పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎన్. రజనీకుమారి, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment