హాస్పిటల్ సీజ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్ నాయక్ ఆదేశాల మేరకు, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎం. మధువరన్, డిప్యూటీ డెమో ఫైజ్ మొహియుద్దీన్ బుధవారం కొత్తగూడెం పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిని సందర్శించి, అక్కడి ఆసుపత్రిలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం అర్హత లేని వ్యక్తులు వైద్యం చేస్తూ, డయాగ్నస్టిక్ సేవలు నిర్వహించడాన్ని గుర్తించి ఆ ఆసుపత్రిని సీజ్ చేశారు.
ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రులు మరియు రక్త పరీక్ష, డయాగ్నస్టిక్ కేంద్రాలకు అన్ని అనుమతులు ఉన్నా, అర్హతలేని వారు వైద్యం చేసినా, పరీక్షలు నిర్వహించినా చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రైవేట్ ఆసుపత్రులు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం దంతవైద్యంతో సహా ఆయుర్వేదం, ప్రకృతివైద్యం, హోమియోపతి, సిద్ధ, యునాని, ఫిజియోథెరపీ, రక్త పరీక్ష కేంద్రాలు, డయాగ్నస్టిక్ సెంటర్లు అన్నీ రకాల అనుమతులు కలిగి ఉండాలని సూచించారు.

Post a Comment