పెద్దమ్మ తల్లికి ఘనంగా సువర్ణ పుష్పార్చన

పెద్దమ్మ తల్లికి ఘనంగా సువర్ణ పుష్పార్చన

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పాల్వంచ మండలం, కేశవాపురం - జగన్నాధపురం గ్రామంలో వెలిసియున్న శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మతల్లి గుడి) లో గురువారం అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. ఇందులో అమ్మవారికి హారతి, మంత్ర పుష్పం నివేదిక తదితర ప్రత్యేక పూజలను అర్చకులు చేశారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ కార్య నిర్వహణ అధికారి రజిని కుమారి, భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు.

Blogger ఆధారితం.