కొత్తగూడెం కోర్టులో ముగ్గుల పోటీల సందడి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : కొత్తగూడెం జిల్లా కోర్టు భవన ప్రాంగణంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలలో మహిళా న్యాయవాదులు, న్యాయ శాఖ మహిళా సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని సంక్రాంతి కోలాహాలను వారం రోజుల ముందే ప్రతిబింబించారు.
ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ గొల్లపూడి భానుమతి, న్యాయమూర్తులు బత్తుల రామారావు, ఏ. సుచరిత, కె. సాయి శ్రీ, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు తోట మల్లేశ్వరరావు, దూదిపాల రవికుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పివిడి లక్ష్మి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఎస్ఆర్టిసి మాజీ లీగల్ అడ్వైజర్..న్యాయవాది మెండు రాజమల్లు, ఎస్. ప్రవీణ్ కుమార్, అత్తలూరి మనోరమ, జీకే అన్నపూర్ణ, ఎస్. భానుప్రియ, మీనా కుమారి, న్యాయ శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామిశెట్టి రమేష్, లగడపాటి సురేష్, డి. రవి, ప్రమీల, యాద రమణ, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Post a Comment