పెద్దమ్మ తల్లికి ఘనంగా సువర్ణ పుష్పార్చన

పెద్దమ్మ తల్లికి ఘనంగా సువర్ణ పుష్పార్చన
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  పాల్వంచ మండలం, కేశవాపురం - జగన్నాథపురం గ్రామంలో వెలిసియున్న శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మ తల్లి గుడి)లో గురువారం దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎన్. రజనీకుమారి ఆదేశాల మేరకు అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా సువర్ణ పుష్పార్చన నిర్వహించారు.

ఇందులో భాగంగా అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు అర్చకులు చేశారు.

అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Blogger ఆధారితం.