పెద్దమ్మతల్లికి ఘనంగా సువర్ణ పుష్పార్చన

పెద్దమ్మతల్లికి ఘనంగా సువర్ణ పుష్పార్చన

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :   పాల్వంచ మండలం, కేశవాపురం - జగన్నాధపురం గ్రామంలో వెలసియున్న శ్రీ కనకదుర్గ దేవస్థానంలో (పెద్దమ్మగుడి) గురువారం అమ్మవారికి 108 సువర్ణ పుష్పములతో వైభవంగా సువర్ణ పుష్పార్చన నిర్వహించారు.

ఇందులో భాగంగా అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు అర్చకులు నిర్వహించారు. అనంతరం, భక్తులు అమ్మవారిని దర్శించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎన్. రజనీకుమారి, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.