వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ చేసిన న్యాయమూర్తి జి.భానుమతి

వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ చేసిన న్యాయమూర్తి జి.భానుమతి

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :   జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి మంగళవారం కొత్తగూడెంలోని నాలుగు వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కళాశాల బాలికల వసతి గృహం ఏ పవర్ హౌస్ బస్తీ, పోస్ట్ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ ఏ పవర్ హౌస్ బస్తీ, సింగరేణి ఉమెన్స్ కాలేజీ ఎదురుగా ఉన్న బీసీ బాలికల వసతి గృహం, ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన సదుపాయాలు కల్పించాలని వార్డెన్లకు ఆదేశించారు.


ఈ సందర్భంగా వసతి గృహంలో తరగతి గదులు, కిచెన్ రూం, స్టోర్ రూమ్‌లను న్యాయమూర్తి పరిశీలించారు. పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని హాస్టల్ సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార మెనూను పరిశీలించి, నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని హాస్టల్ వార్డెన్‌ను ఆదేశించారు.


ఈ నాలుగు హాస్టల్స్‌లో ఆహారపు మెనూను, సమయపాలన పాటించని సిబ్బంది పట్ల న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఈ తనిఖీలో న్యాయమూర్తితో పాటు డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి.నిరంజన్ రావు, సీనియర్ న్యాయవాది మెండు రాజమల్లు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.