మైనార్టీ ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన 2025 క్యాలెండర్ను ఆ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాధ్యుల ఆధ్వర్యంలో శనివారం కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జీతేష్ వి. పాటిల్ కలెక్టరేట్లో ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మైనార్టీ సర్వీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హబీబ్ అల్లా బేగ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్ ముంతాజ్ అలీ, అసోసియేట్ ప్రెసిడెంట్ గౌస్ పాషా, గౌరవ సలహాదారుడు షేక్ సైదులు, ఉపాధ్యక్షుడు షేక్ జానీ మియా, అదనపు కార్యదర్శి గౌస్, కోశాధికారి షేక్ యాకూబ్, సుధాకర్, కార్యవర్గ సభ్యులు అహ్మద్ షరీఫ్, ఆబీద్, అక్రమ్, యాసీన్, రియాజ్, తాజుద్దీన్, ఖాన్, అన్వర్, ముస్తఫా, సమ్రిన్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment