పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల సేవలకు గుర్తింపే జాతీయ స్థాయి అవార్డు - డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల

పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల సేవలకు గుర్తింపే జాతీయ స్థాయి అవార్డు - డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :పాల్వంచలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది రోగులకు సకాలంలో సేవలు అందిస్తున్నారని, వారి సేవలను గుర్తించిన ప్రభుత్వం జాతీయ స్థాయిలో NQAS సర్టిఫికెట్‌తో ప్రశంసించిందని రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.

పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్వాల వైద్యులను ఘనంగా సన్మానించారు. గురువారం పలువురు కాంగ్రెస్ నాయకులతోపాటు ఆయన పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఆసుపత్రి ఆర్.ఏం.ఓ డాక్టర్ సోమరాజు దొర, సూపరింటెండెంట్ మెడికల్ ఆఫీసర్ రాంప్రసాద్‌తో పాటు పలువురు డాక్టర్లను సన్మానించారు.

ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ వైద్యులు దేవుళ్లతో సమానమని, రోగుల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత డాక్టర్లదేనన్నారు. వైద్య సేవలు పట్టణ ప్రాంతాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపచేయాలని కొత్వాల కోరారు.

ఈ కార్యక్రమాల్లో పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, యూత్ కాంగ్రెస్ పట్టణ, మండల అధ్యక్షులు పైడిపల్లి మహేష్, మెలిగ మహేష్, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, కాపర్తి వెంకటాచారి, గంధం నర్సింహారావు, మస్నా శ్రీనివాస్, ఉండేటి శాంతివర్ధన్, ప్రసాద్, మల్లేష్, దేవా, రాము, తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.