పెద్దమ్మతల్లికి ఘనంగా సువర్ణ పుష్పార్చన

 

పెద్దమ్మతల్లికి ఘనంగా సువర్ణ పుష్పార్చన

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పాల్వంచ మండలం, కేశవాపురం-జగన్నాధపురం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మగుడి)లో గురువారం ను  పురస్కరించుకుని అమ్మవారికి 108 సువర్ణ పుష్పములతో వైభవంగా సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. ఇందులో భాగంగా అర్చకులు అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించి తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎన్.రజనీకుమారి, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Blogger ఆధారితం.