క్రీడల్లో గెలుపు ఓటములు సహజం - డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల

 

క్రీడల్లో గెలుపు ఓటములు సహజం - డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో సాగాలి, తిరిగి విజయం కోసం ప్రయత్నించాలి అని రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. సిఎం. కప్ - 2024 జిల్లా స్థాయి క్రీడలు నేటి నుండి 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. కొత్తగూడెం ప్రగతి మైదానంలో సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ జిల్లా స్థాయి పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ, మానవ జీవితంలో క్రీడలు ఎంతో అవసరమని, శరీర దృఢత్వానికి మరియు మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపకరిస్తాయని చెప్పారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్, జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ ఎం. పరంధామరెడ్డి, ఒలంపిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జి. యుగంధర్ రెడ్డి, కె. మహిధర్, వై. వెంకటేశ్వర్లు, రాజేంద్రప్రసాద్, జిల్లా ఫిజికల్ డైరెక్టర్లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Blogger ఆధారితం.