విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోను ప్రతిభ చాటాలి - డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోను ప్రతిభ చాటాలి - డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసిస్తూనే, క్రీడల్లోనూ ప్రతిభ చాటి, జాతీయ స్థాయి గుర్తింపు పొందాలని రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న CM  కప్ క్రీడల్లో భాగంగా శుక్రవారం పాల్వంచ మున్సిపాలిటీ పరిధి శ్రీనివాస కాలనీలోని క్రీడా మైదానంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. కేటీపీఎస్ విద్యుత్ కళాభారతి లో ఫుట్ బాల్ పోటీలు నిర్వహించారు.

ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కొత్వాల మాట్లాడుతూ క్రీడల వలన శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుందని అన్నారు. విద్యార్థులు క్రీడల్లో రాణించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పేరును జాతీయ స్థాయిలో నిలపాలని కొత్వాల అన్నారు.


అథ్లెటిక్స్ లో జాతీయ స్థాయిలో రెండవ స్థానం పొందిన శ్రీతేజను అభినందించిన కొత్వాల, క్రీడా సంఘాలు, అధికారులు


ఇటీవల భువనేశ్వర్ లో జరిగిన జాతీయ అథ్లెటిక్స్ లో రెండవ స్థానం పొందిన, జిల్లాకు చెందిన టీ. శ్రీతేజను కొత్వాల తోపాటు పలువురు అభినందించారు. శ్రీతేజకు పథకం ఇచ్చి, శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమాల్లో జిల్లా యువకులు, సింగరేణి జనరల్ మేనేజర్ (ఎడ్యుకేషన్) జి. శ్రీనివాస్, మున్సిపల్ కమీషనర్ కె. సుజాత, ఫరీద్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జి. యుగేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, చైర్మన్ మహిధర్, కార్యదర్శి రాజేంద్రప్రసాద్, జిల్లా షటిల్ బాడ్మింటన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీదేవి, గిరిజన నాయకులు ఆరెం ప్రశాంత్, కోచ్ నాగేందర్, ఫుట్ బాల్ కోచ్ ప్రేమ్ కుమార్, కచ్చా నరేష్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.