భారతదేశ ఆర్ధిక వ్యవస్థను పెంపొందించిన మహోన్నత నేత మన్మోహన్ సింగ్ - డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల

భారతదేశ ఆర్ధిక వ్యవస్థను పెంపొందించిన మహోన్నత నేత మన్మోహన్ సింగ్ - డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : భారతదేశ ఆర్ధిక వ్యవస్థను పెంపొందించి, ప్రపంచ దేశాల్లో భారత స్థాయిని మెరుగుపరిచిన మహోన్నత నేత మన్మోహన్ సింగ్ అని రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.


దేశ 14వ ప్రధాన మంత్రిగా పరిపాలన సాగించి, ఎన్నో అత్యున్నత పదవులు అలంకరించి, అనేక పురస్కారాలు అందుకున్న మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి మృతి చెందారు.


పాల్వంచలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు.


మన్మోహన్ సింగ్ చిత్రపటానికి కొత్వాలతో పాటు కాంగ్రెస్ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, రెండు నిమిషాలు మౌనం పాటించారు.


ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ, 10 సంవత్సరాలు ప్రధానిగా, 1990వ దశకంలో ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ అనేక ఆర్థిక సంస్కరణలు చేపట్టారని తెలిపారు. 100 రోజులు ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ వంటి పథకాల ద్వారా పేదల సంక్షేమానికి కృషి చేశారన్నారు. ప్రధాని పదవి కంటే ముందు ఆయన ఆర్థిక మంత్రిగా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా, RBI గవర్నర్‌గా విశిష్ట సేవలు అందించారని పేర్కొన్నారు.


మన్మోహన్ సింగ్ సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్‌లతో పాటు పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారని, ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పేద ప్రజలకు సహాయపడాలని కొత్వాల సూచించారు.


ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు యర్రంశెట్టి ముత్తయ్య, ఎల్.డి.ఏం కోఆర్డినేటర్ బద్ది కిషోర్, లేబర్ సెల్ చైర్మన్ సాదం రామకృష్ణ, యూత్ కాంగ్రెస్ పట్టణ, మండల అధ్యక్షులు పైడిపల్లి మహేష్, మెలిగ మహేష్, మహీపతి రామలింగం, వై.వెంకటేశ్వర్లు, కాల్వ భాస్కర్ రావు, తుమ్మల శివారెడ్డి, కాపర్తి వెంకటాచారి, చింతా నాగరాజు, సందు ప్రభాకర్, కందుకూరి రాము, చాంద్ పాషా, మాలోత్ కోటి నాయక్, కాపా శ్రీను, గంధం నర్సింహారావు, జాలే కరుణాకర్ రెడ్డి, పులి సత్యనారాయణ, ధర్మసోత్ ఉపేంద్ర నాయక్, భాషాబోయిన అశోక్, మస్నా శ్రీనివాస్, బండి నాగరాజు, గుగులోత్ బాలు, భూక్యా రాములు, జర్పుల లింగ్యా నాయక్, కటుకూరి శేఖర్, అజారుద్దీన్, గంగపురి శేఖర్, జక్కుల రాము, తదితరులు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.