జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి - న్యాయమూర్తి బత్తుల రామారావు
జె.హెచ్.9. మీడియా,లీగల్ : భద్రాద్రికొత్తగూడెం జిల్లా కోర్టులో ఈ నెల 14న జరిగే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బత్తుల రామారావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
న్యాయమూర్తి బత్తుల రామారావు మాట్లాడుతూ "జాతీయ లోక్ అదాలత్ రాజీ పడదగ్గ కేసులకు అనువైన వేదిక. కేసుల సత్వర పరిష్కారాల కోసం కక్షిదారులు ఈ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి" అని పేర్కొన్నారు. కేసులు రాజీ చేసుకోవడంలో ఆసక్తి ఉన్నవారు ఈ లోక్ అదాలత్ ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
జాతీయ లోక్ అదాలత్ లో రాజీకి అవకాశం ఉన్న కేసులు:
- యాక్సిడెంట్ కేసులు
- సివిల్ కేసులు
- చీటింగ్ కేసులు
- చిట్ ఫండ్ కేసులు
- భూ తగాదాలకు సంబంధించిన కేసులు
- వివాహ బంధాలకు సంబంధించిన కేసులు
- చిన్నచిన్న దొంగతనం కేసులు
- ట్రాఫిక్ చాలాన్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
- కుటుంబ తగాదాలు
- బ్యాంకు కేసులు
- టెలిఫోన్ కేసులు
- కొట్టుకున్న కేసులు
- సైబర్ క్రైమ్ కేసులు

Post a Comment