పెద్దమ్మతల్లిని అధికసంఖ్యలో దర్శించుకున్న భక్తులు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పాల్వంచ మండలం, కేశవాపురం - జగన్నాధపురం గ్రామంలో ఉన్న శ్రీ కనకదుర్గ దేవస్థానంలో (పెద్దమ్మగుడి) ఆదివారం అమ్మవారిని అధికసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఉదయం నుంచే పరిసర గ్రామాల నుండి, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మరియు ఇతర జిల్లాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వారు తమ కోరికలు తీర్చుకోవాలని ఆశిస్తూ బోనాలు సమర్పించి, అన్నప్రాశనాలు, వాహనపూజలు, తలనీలాలు, ఒడిబియ్యం, చీరలు, కనుములు, తదితర మొక్కులను అమ్మవారికి సమర్పించారు. భక్తులు తీర్థప్రసాదాలను స్వీకరించారు.
భక్తుల ప్రత్యేక దర్శనం కోసం క్యూలైన్లను ఏర్పాటు చేసి, ఉచిత పులిహోర ప్రసాదం, మంచినీటి వసతి వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయటానికి దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎన్. రజనీకుమారి మరియు వారి సిబ్బంది కృషి చేశారు.

Post a Comment