ఎన్యుమరేటర్లు తో కలెక్టర్లు విస్తృతంగా మాట్లాడాలి - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : హౌస్ లిస్టింగ్ పూర్తిచేసుకుని నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో కలెక్టర్లు ఎన్యుమరేటర్లు తో విస్తృతంగా మాట్లాడాలని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన ప్రసంగించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఐ.డి.ఓ.సి కార్యాలయం నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఐఏఎస్.. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రజల నుంచి అనేక సందేహాలు వ్యక్తమవుతుంటాయి, కలెక్టర్లు ఎన్యుమరేటర్లు తో ఎప్పటికప్పుడు మాట్లాడితే ప్రజల సందేహాలు ఏంటో వెంటనే తెలుసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు.
ప్రజల సందేహాలను కలెక్టర్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి ప్రజల అనుమానాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కువ సార్లు సర్వేలో భాగస్వాములు అయ్యేలా చూడాలని అధికారులను కోరారు.
సమగ్ర కుటుంబ సర్వే చాలా పెద్ద కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాన్ని ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకువెళ్తున్న అధికారులను డిప్యూటీ సీఎం అభినందించారు. క్వశ్చనీర్ పకడ్బందీగా రూపొందించారని , ఎనిమరేటర్లకు బాగా శిక్షణ ఇచ్చారు అని ఆయన అన్నారు. ఇదే రీతిలో కుటుంబ సర్వేను విజయవంతంగా నిర్వహించాలని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంత కుమారి, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు


Post a Comment