రెసిడెన్షియల్ హోటల్స్ ను తనిఖీ చేసిన న్యాయమూర్తి జి.భానుమతి

రెసిడెన్షియల్ హోటల్స్ ను తనిఖీ చేసిన న్యాయమూర్తి జి.భానుమతి

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ - హైదరాబాద్ వారి ఆదేశాల ప్రకారం "బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన"  క్యాంపెన్ లో భాగంగా సోమవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి స్థానిక కొత్తగూడెం లోని సూపర్ బజార్ ఏరియాలోని  రెసిడెన్షియల్  హోటల్స్, లాడ్జిలను ఆకస్మిక తనిఖీ చేశారు. 

18 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకున్నట్లయితే  బాలకార్మిక చట్టం ప్రకారం పనిలో పెట్టుకున్న యజమానిపైన కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. 

ఈ తనిఖీలలో కొత్తగూడెం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మహమ్మద్ షర్ఫుద్దీన్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి. నిరంజన్ రావు,  సీనియర్ న్యాయవాది మెండు రాజమల్లు, తదితరులు పాల్గొన్నారు..

Blogger ఆధారితం.