కస్టమర్లకు నాణ్యమైన పెట్రోల్ ను అందించాలి - కొత్వాల
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: కస్టమర్లకు నాణ్యమైన పెట్రోల్, డీజిల్ ను అందించాలని డీసీఎంఎస్ చైర్మన్, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని కుంటినాగులగూడెం లో ఏర్పాటు చేసిన శుభ ఫిల్లింగ్ స్టేషన్ ను శుక్రవారం కొత్వాల ప్రారంభించారు.
శుభ ఫిల్లింగ్ స్టేషన్ నిర్వాహకులు ముప్పాళ్ళ పద్మ, జాస్తి ధనలక్ష్మిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభ పూజలో కొత్వాల పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అతి సామాన్యుడికి కూడా వాహనం నిత్యావసరమైన పరిస్థితులలో క్వాలిటీ, క్వాంటిటీ ముడి సరుకును అందించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు రంగా కిరణ్, పాల్వంచ మాజీ జడ్పిటిసి సభ్యులు యర్రంశెట్టి ముత్తయ్య, నూకల రంగారావు, కందుకూరి రాము, దారా చిరంజీవి, పైడిపల్లి మహేష్, పులి సత్యనారాయణ, పిట్టల రాము, మాలోత్ కోఠి నాయక్, శాంతి వర్ధన్, అజిత్, సామా వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment