పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: బూర్గంపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ నగర్ లో పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా గాంధీ నగర్ లోని ప్రతి ఇంటిని సోదా చేసి ప్రతి ఒక్కరి వివరాలను అడిగి పోలీసులు నమోదు చేసుకున్నారు . పోలీసులు మొత్తం 210 ఇండ్లను సోదా చేయగా సరైన పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలు,03 ఆటోలు, ఒక కారును స్వాదీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల సమాచారం ఎప్పటికప్పుడు పోలీసులకు అందించి బాధ్యతగా వ్యవహరించాలని గ్రామస్తులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పాల్వంచ సీఐ వినయ్ కుమార్ బూర్గంపాడు ఎస్ఐ రాజేష్, పాల్వంచ రూరల్ ఎస్సై సురేష్,కొత్తగూడెం వన్ టౌన్ ఎస్ఐ విజయ తదితరులు పాల్గొన్నారు

Post a Comment