పెండింగ్ లోని కేసుల సత్వర పరిష్కారానికి అధికారులందరూ బాధ్యతగా కృషి చేయాలి - ఎస్పీ

పెండింగ్ లోని కేసుల సత్వర పరిష్కారానికి అధికారులందరూ బాధ్యతగా కృషి చేయాలి - ఎస్పీ

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: పెండింగ్ లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి అధికారులందరూ బాధ్యతగా కృషి చేయాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ అన్నారు. మంగళవారం ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ పెండింగ్ లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి అధికారులందరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న పలు కేసులు వివరాలను,వాటి పురోగతిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.కొత్త కొత్త టెక్నాలజీలతో సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజల ఖాతాల నుండి నగదు మాయం చేస్తున్నారు.

ప్రతీ కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టి "క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్" ద్వారా నేరస్తులకు శిక్ష పడే విధంగా బాధ్యతగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. దొంగతనం కేసుల్లో చోరీ సొత్తును రికవరీ చేసి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.సైబర్ నేరాల బారిన పడకుండా జిల్లా ప్రజలకు అనునిత్యం అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ వారిని అప్రమత్తం చేయాలని తెలిపారు.గంజాయి లాంటి మత్తు పదార్ధాలను రవాణా చేసే వారితో పాటు సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహారించాలని తెలిపారు. గుట్కా,మట్కా,జూదం, బెట్టింగ్ లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అట్టి వ్యక్తులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని తెలిపారు.రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేసుకుని వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తూ ఉండాలని తెలిపారు.బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. 

ఈ సమావేశంలో ఇల్లందు డిఎస్పీ చంద్ర భాను,కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి,డీసీఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామి,ఇన్స్ పెక్టర్ లు, ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు,జిల్లా పోలీస్ కార్యాలయ ఏవో జయరాజు మరియు సీఐలు,ఎస్సైలు,సిబ్బంది పాల్గొన్నారు.

Blogger ఆధారితం.