కలెక్టరేట్ లో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

కలెక్టరేట్ లో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: జిల్లా కలెక్టరేట్ లోని ఐడిఓసి కార్యాలయం సమావేశ  మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ  ఆధ్వర్యంలో గురువారం ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్యఅతిథిగా హాజరై వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు .

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రామాయణం రచించి ప్రపంచానికి తెలియజేసిన ఆదికవి వాల్మీకి మహర్షి అంటూ గుర్తు చేశారు.ప్రపంచం ఉన్నంతవరకు రామాయణం, వాల్మీకి చరిత్ర ఉంటుందని, ఇతిహాసాల్లో మొదటిది రామాయణం,పెద్దది మహాభారతం అని అన్నారు. అలాంటి రామాయణాన్ని రచించిన వాల్మీకి స్ఫూర్తితో అనేక మంది రచయితలుగా, కవులుగా మారారు  అని అన్నారు. 

 ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఇందిరా, కలెక్టరేట్ పరిపాలన అధికారి  రమాదేవి, బీసీ సంఘ నాయకులు మురికి వెంకన్న, భోగా నందకిషోర్, ఉలవల రాములు, కోడుమూరు సత్యనారాయణ, గుర్రం శ్రీనివాసరావు, చల్లా శివ, చెప్పా శ్రీనివాస్, చెప్పా వెంకటేశ్వరరావు, గొలుసు శ్రీనివాస్ రావు  మరియు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.