రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ కార్ద్ సర్వేను సద్వినియోగం చేసుకోవాలి - కొత్వాల
పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు వర్తక సంఘం ప్రాంతంలో అధికారులు నిర్వహిస్తున్న డిజిటల్ సర్వే కార్యక్రమాన్ని తహసీల్దార్ వివేక్ తో కలిసి కొత్వాల పరిశీలించారు.
ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ ఇంటింటి సర్వేలో గతంలో లేని రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు లేని వివరాలను ఇందులో తేలుపవచ్చన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులు పొందాడనియూకి ఈ డిజిటల్ కార్డు మాత్రమే ప్రామాణికం అన్నారు. కుటుంబానికోక డిజిటల్ కార్డు అందజేసి, దానిలో అన్ని వివరాలు పొందుపరుస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కొత్వాల కోరారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వివేక్, ఆర్.ఐ.రవికుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఎస్.వి.ఆర్.కె.ఆచార్యులు, కాపర్తి వెంకటాచారి, బాలినేని నాగేశ్వరరావు, కందుకూరి రాము, పాబోలు నాగేశ్వరరావు, బాడిశ శంకరరావు, హర్షవర్ధన్, సురేష్, సాయి, వేణు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment