రైతులు పెసర కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

రైతులు పెసర కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: ఖమ్మం - భద్రాద్రి జిల్లాల రైతులు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన పెసర కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని డీసీఎంఎస్ చైర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఖమ్మం ఏఎంసీ లోని డీసీఎంఎస్ పెసర కొనుగోలు కేంద్రాన్ని కొత్వాల సందర్శించారు. పెసర రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తేమ శాతం, పెసర లో ఉన్న వేరే పంట గింజల గురించి రైతుల ద్వారా తెలుసుకున్నారు. 

పెసర కొనుగోలు ను వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ డిసిఎంఎస్ ద్వారా జిల్లాలో ఖమ్మం, వైరా ఏఎంసి లలో పెసర కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. పెసర్లు ఒక క్వింటాకు 8,682 రూపాయలు ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేస్తున్నదని కొత్వాల తెలిపారు. రైతులు డీసీఎంఎస్ పెసర కొనుగోలు కేంద్రాలలో పెసర్లు  విక్రయించి ప్రభుత్వం మద్దతు ధర పొందాలని అన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొత్వాల కోరారు. 

ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ కె.సందీప్, డైరెక్టర్లు కుంచేపు వెంకటేశ్వర్లు, తోళ్ల కోటయ్య, మారుతీ  యట్టయ్య, తదితరులు పాల్గొన్నారు.



Blogger ఆధారితం.