ఆరుగురు మహిళలకు జైలు శిక్ష
కేసు వివరాలు ఇలా... జూలూరుపాడు మండలం వెంకన్నపాలెంకు చెందిన జాజిరియా సునీత వేంగనపాలెం క్రాస్ రోడ్డు వద్ద బంగారం షాప్ నడుపుతుంది. అక్టోబర్ 13, 2017న బంగారం షాపులో బంగారం కొనేవాళ్ళ రద్దీ ఎక్కువగా ఉన్నది. గుర్తుతెలియని మహిళలు బంగారు నగలు చూసి కొనకుండా వెళ్ళిపోయారు. తనకు అనుమానం వచ్చి సిసి ఫుటేజ్ చూడగా ఒకరు దొంగతనం చేసిన వస్తువును మరొకరికి ఇస్తూ అలా మొత్తం అందరు కలిసి వెళ్లిపోయారు. దొంగలించిన వెండి పట్టీల విలువ 7వేల రూపాయలు ఉంటుంది.
బాధితులు జూలూరుపాడు పోలీస్ వారికి ఫిర్యాదు చేయగా అప్పటి సబ్ ఇన్స్ స్పెక్టర్ పి. శ్రీనివాస్ కేసు నమోదు చేసుకొని అప్పటి వరంగల్ జిల్లా నరసింహుల పేట మండలం పకీర తండా బొడ్డు తండాలకు చెందిన గుగులోతు బి.భూక్య మంక్తి, భూక్య అంకు, భూక్యా సీత, ఆంగోతు రాజి,లాకావత్ కాళీ ల వద్ద నుంచి దొంగతనం చేసిన వెండి పట్టీలు రికవరీ చేసి, దర్యాప్తు అనంతరం ఆరుగురు మహిళలపై కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు.
కోర్టులో ఏడుగురు సాక్షుల విచారించిన అనంతరం వారిపై నేరం రుజువు కాగా ఆరుగురు మహిళలకు ఒక్కొక్కరికి ఆరు నెలల జైలు శిక్ష, 500 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసెక్యూషన్ విశ్వశాంతి, నాగలక్ష్మి లు నిర్వహించారు. నోడల్ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ వి. రామమూర్తి,లైజన్ ఆఫీసర్ ఎస్కే అబ్దుల్ ఘని, (కోర్టు డ్యూటీ ఆఫీసర్) పీ.ఎస్. జూలూరుపాడు పిసి. పీ.ఉపేందర్ రావు లు సహకరించారు.

Post a Comment