మహిళల భద్రతే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం : ఎస్పీ రోహిత్ రాజ్ ఐపిఎస్

మహిళల భద్రతే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం : ఎస్పీ రోహిత్ రాజ్ ఐపిఎస్
జె.ఎచ్.9. న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: మహిళలపై జరుగుతున్న నేరాలను అడ్డుకొని వారికి న్యాయం చేయడానికి వీలుగా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ తరపున ఏర్పాటు చేసిన టి.జి. డబ్ల్యు.ఎస్.డబ్ల్యు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన విభాగమే షీ టీమ్స్ అని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తెలిపారు. శుక్రవారం కొత్తగూడెం పట్టణంలోని పాత చుంచుపల్లి పోలీస్ స్టేషన్ భవనంలోకి మార్చిన షీ టీమ్స్, ఏ.ఎచ్.టి.యూ కార్యాలయాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపిఎస్ ప్రారంభించారు. 

 లైంగిక వేధింపులు,ర్యాగింగ్,ఈవ్ టీజింగ్,బ్లాక్మెయిలింగ్, ఇతర ఇబ్బందులు ఎదుర్కొనే మహిళలు జిల్లా షీ టీమ్స్ ను నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు. జిల్లా షీ టీమ్స్ నంబర్ 8712682131 కి ఫోన్ చేసి తమ సమస్యని తెలియజేసుకోవచ్చని అన్నారు.ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గొప్యంగా ఉంచబడతాయని అన్నారు.ఫిర్యాదు అందుకున్న వెంటనే నేరస్తుడిని షీ టీం కార్యాలయానికి పిలిచి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.పరిస్థితిని బట్టి నిందితుడిపై కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు.

 బాలికలకు,మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నిర్భయంగా షీ టీమ్ ను సంప్రదించాలని తెలియజేసారు. జనాలు రద్దీగా ఉండే ప్రదేశాలలో,రైల్వేస్టేషన్,బస్టాండ్లు, కళాశాలల వద్ద షీ టీమ్స్ సభ్యులు నిరంతరం సంచరిస్తూ ఆకతాయిల ఆగడాలను నిరోధించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ పరితోష్ పంకజ్ ఐపిఎస్, కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు,ఎస్బి ఇన్స్పెక్టర్స్ నాగరాజు,శ్రీనివాస్, 1టౌన్ సీఐ కరుణాకర్,2టౌన్ సీఐ రమేష్, సైబర్ క్రైమ్స్ సీఐ జితేందర్,ఆర్ఐలు సుధాకర్,రవి,లాల్ బాబు,కృష్ణారావు షీ టీమ్స్ ఇంచార్జి ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి,ఆర్ఎస్సై రమాదేవి, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Blogger ఆధారితం.